Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-ములుగు
మండలంలోని కొడిశెలకుంట శివారు చంద్రుతండాలో శనివారం ఎన్నికల కోడ్ అమలుపై ఎస్సై బండారి రాజు ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్సై తన సిబ్బందితో గ్రామానికి చేరుకుని ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. గుడుంబా తయారీ, విక్రయాలు, బెల్టు షాపులు నడపరాదని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి విక్రయాలు, తయారీ చేపడితే లక్ష రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. ఎలాంటి ఘర్షణలకు పాల్పడకుండా ఉండాలని అవగాహన కల్పించారు. సజావుగా ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఈ సమావేశంలో సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.