Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు
నవతెలంగాణ-తొర్రూరు రూరల్
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుజేస్తున్న సంక్షేమ పథకాలే తమ పార్టీని మళ్లీ గెలిపిస్తాయని పాలకుర్తి నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్రావు అన్నారు. తొర్రూర్ మండలంలో శనివారం అమర్సింగ్, దుబ్బ, కొమ్మనపల్లి, జీకేతండాల్లో, కానాపురం, జమస్తపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రమేర్పడిన తరువాత ఎన్నికలముందు ఇచ్చిన హామీలే కాకుండా ప్రజా ఉపయోగకరమైన పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ ఏడు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండి పోతున్న పంటలకు నీరందించేందుకు ఎస్సారెస్పీ ద్వారా చెరువులు, కుంటలు నింపామన్నారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు గతంలో ఇచ్చిన కంటే రెండింతలు పెంచామన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ తదితర పథకాలు ప్రవేశపెట్టి ప్రజల సమస్యలు పరిష్కరిస్తోందన్నారు. టీఆర్ఎస్కు ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమి ముసుగులో వచ్చే వారిని ఓటనే వజ్రాయుధంతో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాంధీనాయక్, ఎంపీపీ సోమయ్య, డాక్టర్ సోమేశ్వరరావు, శ్రీనివాస్, సీతారాములు, దామోదర్రెడ్డి పాల్గొన్నారు.