Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటేష్
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీిఆర్ఎస్ ప్రభుత్వం దళితులను, అణగారిన వర్గాలను అణచివేస్తున్నాయని, దేశ, రాష్ట్ర రాజకీయాలను యువత ద్వారానే మార్చొచ్చని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదాసు వెంకటేష్ అన్నారు. డివిజన్కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ దొంగల పార్టీగా ముద్ర వేసుకున్నదని, రాష్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకరుందని ఆరోపిం చారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే తనలక్ష్యమన్నారు.
కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్టు కేటాయించడంతో అదినాయకత్వం తేల్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయ కులు తనకు టిక్కెట్టు రాకుండా అడ్డుకుంటున్నార న్నారు. నియోజకవర్గానికి సంబంధం లేనివారు కూడా ఢిల్లీలో ఉండి రాజకీయాలు చేస్తున్నారని విమర్శిం చారు. అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టి తనకు టిక్కెట్టు ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా ఈనెల 14న నామినేషన్ వేస్తానన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరానున్నట్టు చెప్పారు. ఇప్పటికైనా అధి ష్ఠానం ఆలోచించాలన్నారు. ఈ సమావేశంలో గబ్బెట రాజయ్య, ప్రభాకర్, రత్నం, మహేందర్, శివకుమార్, వెంకటేష్ పాల్గొన్నారు.