Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమాదేవి
నవతెలంగాణ-ములుగు
ఈ నెల 12 నుండి ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల టర్నింగ్ అధికారి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నేడు ఆర్డీఓ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ములుగు ఆర్డీఓ కూతాటి రమాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం నేడు ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. ఈ నెల 12న ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్న సందర్భంగా నామినేషన్ వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రిటర్నింగ్ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లకు, అభ్యర్థుల కొరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ కార్యాలయంలో టోల్ ఫ్రీనెంబర్ 08715-223023 ఏర్పాటు చేసినట్లు చెప్పారు.