Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కన్నాయిగూడెం
ఓట్ల కోసం వచ్చే పార్టీలను నిలదీయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు ఇరుగు పైడి మాదిగ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు రమేష్ అధ్యక్షతన మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇరుగు పైడి మాదిగ, జిల్లా అధ్యక్షుడు అంబాల చంద్రమౌళి మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పైడి మాదిగ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంద రోజుల్లో వర్గీకరణ చేపడుతామని హామీ ఇచ్చి మాదిగలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా ఏనాడు పార్లమెంట్లో వర్గీకరణ అంశంపై ప్రస్తావించ లేదన్నారు. కేసీఆర్ అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మాణించి అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపిస్తామని ప్రగల్బాలు పలికారన్నారు. అంబాల చంద్రమౌళి మాదిగ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం మాదిగ జాతిని విస్మరించి వెనకబాటుకు గురి చేసిందన్నారు. ఓట్ల కోసం మాదిగ గూడాలు, పల్లెల్లకు వచ్చే పార్టీలను నిలదీయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి గజ్జెల ప్రసాద్ మాదిగ, పురుషోత్తం నారాయణ, రమేష్, వివిలాల స్వామి, జనార్థన్, తిప్పనపల్లి వెంకట్, సతీష్, ముత్తయ్య, కోయ్యల సమ్మయ్య, భద్రక్క, ఎల్లమ్మ పాల్గొన్నారు.