Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
నవతెలంగాణ-జనగామ
'జనగామ నియోజక వర్గ మహాకూటమి అభ్యర్థిగా టిక్కెట్టు నాదే... విజయం కూడా నాదే.'అని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జగనామ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు జనగామ టిక్కెట్టు రాదంటూ కొన్ని దుష్టశక్తులు దుష్పచారం చేస్తున్నాయన్నారు. ఇలాంటి గ్లోబల్ ప్రచారాన్ని ఎవర నమ్మొదని కోరారు. ఎన్నికల్లో జనగామ నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. జనగామ ప్రాంతం చాలా ఎత్తైన పదేశం కావడం వలన ఇక్కడి ప్రజలకు సాగునీరు, తాగునీరు అవసరాన్ని గుర్తించి 7 రిజర్వాయర్లకు రూపకల్పన చేసి ప్రాజెక్టుల ద్వారా నీరందించానన్నారు. మూడు దశాబ్దాలుగా జనగామ నియోజకవర్గ ప్రజలతో అవినాభావ సంబంధం ఉన్నదన్నారు. జనగామ ప్రాంత అభివృద్ధికి ఎంతో పాటుపడ్డానని తెలిపారు. జనగామ ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేయాలనే పట్టుదలతో ఉన్నానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగున్నరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. తొమ్మిది నెలల ముందే ముందస్తు ఎన్నికలకు సిద్ధమై ప్రజలపై ఆర్థికభారం మోపిందన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ప్రజలే చరమగీతం పాడతారన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కారగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి చెంచారపు శ్రీనివాస్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు సత్యనారాయణరెడ్డి, సుధాకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అన్వర్, ఉమాపతిరెడ్డి, జిల్లా నాయకులు షరీఫ్, కరుణాకర్రెడ్డి, అధికార ప్రతినిధి ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.