Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ రాష్ట్ర మహిళ కార్యదర్శి గండ్ర జ్యోతి
నవతెలంగాణ-రేగొండ
కాంగ్రెస్తోనే ప్రజా సంక్షేమం జరుగుతుందని కాంగ్రెస్ రాష్ట్ర మహిళ కార్యదర్శి గండ్ర జ్యోతి అన్నారు. శనివారం మండలంలోని జోగయ్యపల్లి, కొడవటంచ, చెంచుపల్లి, పోచంపల్లి, లింగాల గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా విస్తత ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా గండ్ర జ్యోతి మహిళలకు బొట్టు పెడుతూ ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ అభివద్ధికి బాటలు వేసింది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్కు పరిపాలించడం చేతకాక ముందస్తు ఎన్నికలకు వచ్చాడని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చెయ్యలేదన్నారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి సొంత ఆస్తులు కూడా బెట్టుకునేందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు పని చేశారని ఆరోపించారు. స్పీకర్గా పని చేసిన మధుసూదనాచారి భూపాలపల్లి కొడుకులతో నియోజకవర్గాన్ని దోచుకుతిన్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమం కోసం పని చేసే వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో భూపాలపల్లిలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. నిస్వార్థంగా సేవ చేసేందుకు గండ్ర వెంకటరమణారెడ్డి సిద్ధంగా ఉన్నారని, ప్రజలంతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హింగె మహేందర్, నాయకులు కట్ల చిన్ని, విద్యాసాగర్ రెడ్డి, రహీమ్, పట్టెం శంకర్, మదాడి కర్ణాకర్రెడ్డి, రాజయ్య, పబ్బ సమ్మయ్య, సామల పాపిరెడ్డి, సంతోష్, పెండ్యాల శంకర్, కోలెపాక ప్రసంగి, భుక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.