Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్లపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 12న నిర్వహించే గౌడ ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొనగాని యాదగిరి కోరారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కల్లును ఆబ్కారీ శాఖ నుంచి తొలగించి ఖాదీ బోర్డులో ఏర్పాటు చేయాలని, 164 జీవోను రద్దు చేయాలని కోరారు. వికలాంగ గీత కార్మికులకు పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొనగాని యాదగిరి, రాష్ట్ర కార్యదర్శి వడ్లకొండ రమేష్, రాష్ట్ర కార్యదర్శి తాళ్లపల్లి దామోదర్గౌడ్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు మోటపోతుల చందర్ పాల్గొన్నారు.
రేగొండ : ఈ నెల 12న భూపాలపల్లి ఏఎస్ఆర్ గార్డెన్లో జరుగబోయే తెలంగాణ గౌడ సంఘం ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.యాదగిరిగౌడ్ పిలుపునచ్చారు. ఈ మేరకు మండలకేంద్రంలో శనివారం ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి వడ్లకొండ రమేష్, జిల్లా అధ్యక్షులు మోటపోతుల చందర్గౌడ్, నాయకులు మోడెం ఉమేష్గౌడ్, తాళ్లపల్లి దేవేందర్, శ్రీనివాస్, బండి కిరణ్, అయిలి శ్రీధర్, పెరుమాండ్ల మహేందర్, తిరుపతి, బండి అశోక్ పాల్గొన్నారు.