Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్వో అప్పయ్య
నవతెలంగాణ-భూపాలపల్లిటౌన్
జిల్లాలోని ప్రజలకు ఉత్తమ వైద్యసేవలను అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రగతి భవన్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో పని చేస్తున్నటువంటి వైద్యాధికారులు, ఆప్తో మెట్రీషన్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సూపర్వైజర్లకు డాక్టర్ అప్పయ్య వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మంచి వైద్యసేవలు అందించాలని, కంటి వెలుగు క్యాంపులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించారు. కంటి వెలుగు, లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్, ఎన్సీహెచ్, మిషన్ ఇంద్రధనుష్, కీటక జనిత వ్యాధులు, క్షయ వ్యాధి కార్యక్రమాల రిపోర్టులు, ఆన్లైన్, ఆఫ్లైన్ సమాచారం సరైన సమయంలో అందించాలని ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాలు 18 టీంలతో కొనసాగుతున్నాయని, ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు ఇస్తున్నామని వివరించారు. 40 ఏండ్లు పైబడిన 26,214 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటివరకు లక్ష 66వేల758 మంది కంటి పరీక్షలకు రాగా 66వేల832 మందికి కంటి జబ్బులు ఉన్నట్టు గుర్తించామని, 99,926 మందికి ఎలాంటి కంటి జబ్బులు లేనట్టుగా గుర్తించామని అప్పయ్య తెలిపారు. డిప్యుటీ డీఎంహెచ్వో డాక్టర్ గోపాలరావు మాట్లాడుతూ లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ గత నెల 22 నుండి ఈ నెల 4వ తేదీ వరకు 15 రోజుల పాటు 1018 సెర్చ్ టీంలు గ్రామాల్లో పని చేయగా ఒక లక్షా91,224 గృహాలకు వెళ్లి 6లక్షల76వేల766 మందికి పరీక్షలు నిర్వహించి 4,822 మందికి వివిధ రకాల చర్మవ్యాధులున్నట్టు గుర్తించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన రిపోర్టులను జిల్లా కార్యాలయానికి త్వరగా పంపించాలని కోరారు. జిల్లాలో 467 మలేరియా కేసులకుగాను పీవీ 42, పీఎఫ్ 425 కేసులను గుర్తించి చికిత్స చేశామని, డెంగ్యూ కేసులు 117 మందికి చికిత్స సకాలంలో అందించామని, కీటక జనిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్యాంసుందర్ తెలిపారు. జిల్లాలో మలేరియా పాజిటివ్ కేసులున్న ప్రాంతాల్లో రెండో విడత స్రేయింగ్ జరుగుతోందని, మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, చికెన్గున్యా, పైలేరియా తదితర దోమకాటు వ్యాధులను త్వరగా గుర్తించి లేబోటరీ పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కిరణ్మయి, ఇమ్యునైజేషన్ ఆఫీసర్లు డాక్టర్ రవీందర్, శ్యాంసుందర్, డాక్టర్ ఉమాదేవి, హెల్త్ ఎడ్యుకేటర్ అన్వర్, బూర రవి, శ్రీనాథ్, మధు, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
స్వైన్ఫ్లూ రాకుండా వాక్సిన్ చేసిన డీఎంహెచ్వో
కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆదేశానుసారం వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న వైద్యాధికారులు, సిబ్బందికి ప్రాథమిక నివారణలో భాగంగా శనివారం జిల్లా వైద్యాధికారి అప్పయ్య వైద్యాధికారికి ఇనాక్టివేటెడ్ ఇన్ఫ్లూఎంజా వాక్సిన్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వాక్సిన్ వల్ల వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించే క్రమంలో పారామెడికల్ సిబ్బంది వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందున స్వైన్ఫ్లూ వ్యాధులు రాకుండా నివారణ చర్యల్లో భాగంగా ఈ వాక్సిన్ వేసినట్టు తెలిపారు.