Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మండల అధ్యక్షులు చల్లా తిరుపతిరెడ్డి
నవతెలంగాణ-మహాదేవ్పూర్
2013 భూసేకరణ చట్టాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అమలు చేయకుండా భూ నిర్వాసితులకు తీరని అన్యాయం చేశారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చల్లా తిరుపతిరెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇంటింటా కాంగ్రెస్ ప్రచారం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతానికి కాకుండా గజ్వేల్, మెదక్ జిల్లాలకు నీటిని తరలించుకుపోతున్నారని, మల్లన్నసాగర్ ప్రాంతంలో తొండలు గుడ్లు పెట్టని భూములకు అధిక ధర కట్టించి ఈ ప్రాంత రైతులకు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, మహిళా సంఘాలకు రూ.10లక్షల వడ్డీలేని రుణాలు, రూ.లక్ష గ్రాంటు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాబోవు రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు, జెడ్పీటీసీ హసీనాబాను, మహిళా అధ్యక్షురాలు గీతాబాయి, అధికార ప్రతినిధి వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ మేడి శ్రీనివాస్, మాజీ సర్పంచులు చంద్రయ్య, మల్లయ్య, ఎర్రయ్య, సీనియర్ నాయకులు ప్రతాప్రెడ్డి, మహేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.