Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
మండలంలోని లక్నేపల్లి గ్రామంలోని బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ (బిట్స్) కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం ఈసీఈ, సీఎస్ఈ విద్యార్థులకు క్రియాటిక్ సొల్యూషన్స్ కంపెనీ నిర్వాహకులు శనివారం ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎస్ హరిహరన్ మాట్లాడారు. సాఫ్టవేర్ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రాంగణ నియామకాల్లో కళాశాలకు చెందిన 200 మంది హాజరు కాగా 15 మంది ఎంపికైనట్లు తెలిపారు. వీరికి వార్షిక వేతనం రూ.3.2ల లక్షల వరకు ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ సెల్ డీన్ అల్లంకి సన్యాసిరావు, ట్రెయినింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ నరేష్, ఏఓ సురేష్, మేనేజర్ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.