Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్రెడ్డి
- అనాథాశ్రమానికి విరాళాలు అందజేత
నవతెలంగాణ-నర్సంపేట
విద్యార్థులు సామాజిక సేవలు అలవర్చుకోవాలని సిద్దార్థ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోగుల ప్రభాకర్రెడ్డి కోరారు. ఆ కళాశాల విద్యార్థులు సామాజిక సేవలో భాగంగా సేకరించిన రూ.11 వేల విరాళాన్ని శ్రీ రాజరాజేశ్వర అనాథాశ్రమానికి శనివారం అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సామాజిక సేవలో భాగంగా కళాశాలలో ఏటా రక్తదాన శిబిరం, విరాళాల సేకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశ్రమంలోని పిల్లలు క్రమశిక్షణ అలవర్చుకుని భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. విద్యార్థులకు సాయం అందించేలా భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పెండెం శివానంద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.