Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లయన్స్క్లబ్ జోనల్ చైర్పర్సన్ డాక్టర్ భరత్రెడ్డి
- బస్టాండ్ ఆవరణలో ఈవీఎం, వీవీ ప్యాట్లపై అవగాహన
నవతెలంగాణ-నర్సంపేట
18 ఏండ్లు నిండిన రపతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగించాలని లయన్స్క్లబ్ జోనల్ చైర్పర్సన్ డాక్టర్ ఎం భరత్రెడ్డి కోరారు. పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఆ క్లబ్ ఆధ్వర్యంలో ఈవీఎం, వీవీప్యాట్లపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్రెడ్డి మాట్లాడారు. అనంతరం ప్రజలకు ఈవీఎం, వీవీప్యాట్ల గురించి పలు వివరాలు తెలిపారు. సందేహాలను నివృతి చేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రాజేందర్రెడ్డి, కార్యదర్శి రాజ్కుమార్, రాజేందర్, రాజయ్య, ఆర్టీసీ డిపో మేనేజర్ రవీందర్, కల్లెపెల్లి సురేష్, తదితరులు పాల్గొన్నారు.