Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
జిల్లాస్థాయి రోల్ప్లే పోటీలో మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభను చాటి ప్రథమ స్థానం సాధిం చినట్లు ప్రత్యేకాధికారి (ఎస్ఓ) సునీత తెలిపారు. పాఠశాల ఆవరణలో శనివారం విద్యార్థులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. హన్మకొండలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో శుక్రవారం నిర్వ హించిన రోల్ప్లే పోటీలో పాల్గొని 'హెచ్ఐవీ, మత్తు పదార్థాలు, పానీ యాలు, అలవాట్ల వల్ల కలిగే అనర్ధాలు' అంశంపై అవగాహన కల్పిం చారు. ఈ రోల్ప్లేకి గానూ జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతితోపాటు, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సోమయ్య రూ.1500లు పారితోషకం అందించినట్లు ఆమె తెలిపారు. 8, 9వ తరగతి విద్యార్థులు కళ్యాణి, రవళి, శ్రీలక్ష్మీ, భవాని, నవ్య ప్రతిభ చాటినట్లు వివరించారు.