Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ గూటికి పీఏసీఎస్ డైరెక్టర్
నవతెలంగాణ-నల్లబెల్లి
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమని నమ్మి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని నర్సంపేట టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలో తాగు, సాగునీటి సరఫరా కోసం అహర్నిషలు కృషి చేసి రైతులకు రెండు పంటలకు గోదావరి జలాలు అందించి అభివృద్ధిలో నడిపిస్తున్న నాయకుని వైపే వస్తున్నట్లు తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నాయకులకు, కార్యకర్తలకు వెన్నంటి ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని భరోసా ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ గెలిచిన ఎమ్మెల్యే కంటే ఎక్కువగా నిధులు మంజూరు చేయించి నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో నల్లబెల్లి సొసైటీ డైరెక్టర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూముల రజిత, అప్పారావు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోతు సారంగపాణి, మండలాధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్గౌడ్, వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వర్రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు మాలోతు ప్రతాప్సింగ్, వర్ణం నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.