Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
దోపిడీ, పీడన ఉన్నంత కాలం విప్లవోద్యమాలు ఉంటాయని నూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆరెల్లి కృష్ణ స్పష్టం చేశారు. పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో డివిజన్ నాయకులు మొగిలి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన శనివారం అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించగా కృష్ణ మాట్లాడారు. పాలకులు అవలంభిస్తున్న తప్పుడు, ప్రజావ్యతిరేక విధానాల వల్ల సమాజంలో దోపిడి, పీడనలు కొనసాగుతున్నాయని తెలిపారు. దోపిడి పాలకవర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. పాలక వర్గాలు పేదల కోసం పని చేయకుండా భూస్వాములు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్న రీతిలో ఆదివాసీ ప్రాంతంలోని అటవీ సంపదను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో డివిజన్ నాయకుడు ఉసిళ్ల బయ్యన్న, ఐఎఫ్టీయూ డివిజన్ అధ్యక్షులు కుమార్, ఏఐకేఎంఎస్ మండల నాయకులు రాజేష్, దండు శంకర్, ఉప్పుల రవి, భాషబోయిన సాంబయ్య, పైడి, కత్తుల కొంరయ్య, రాంబాబు, రవి, తదితరులు పాల్గొన్నారు.