Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 11న హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న ధర్మాగ్రహ సభను విజయవంతం చేయాలని యూటీఎఫ్ వరంగల్ రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు కోరారు. హన్మకొండలోని ఆ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ అంటూనే హక్కులు కాలరాస్తోందని విమర్శించారు. దశలవారీగా పోరాటాల్లో రెండు దశల్లో నిర్వహించినా ప్రభుత్వంలో కదలిక లేకపోగా అర్ధారతరంగా అసెంబ్లీ రద్దు చేసిందని విమర్శించారు. పీఆర్సీ అమలు, మధ్యంతర భృతి మంజూరు, సీపీఎస్ రద్దు, తదితర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు తప్పవని చెప్పారు. జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు హాజరై సత్తా చాటాలని కోరారు. సమావేశంలో ఫెడరేషన్ జిల్లా కార్యదర్శులు సుజన్ ప్రసాద్, లింగమూర్తి, మండల బాధ్యులు చంద్రయ్య, రాజు, ఇషాక్ అలీ, తదితరులు పాల్గొన్నారు