Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపూర్
బెల్ట్షాపు నిర్వహకుడికి రూ.50 వేల జరిమానా విధించినట్లు ఎస్సై భూక్య నరహరి తెలిపారు. మండలంలోని గుర్రంపేట గ్రామా నికి చెందిన శ్రీరాం సత్యనారాయణ బెల్ట్షాపు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో అతని ఇంట్లో సోదా నిర్వహించి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తహశీల్దార్ దేవాసింగ్ ఎదుట బైండోవర్ చేయగా రూ.50 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా షాపు నిర్వహిస్తున్న సత్యనారాయణ వారం రోజుల్లో జరిమానా చెల్లించని పక్షంలో ఆర్నెళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఎస్సై వివరించారు. ఈ దాడుల్లో సీఆర్పీఎఫ్, సీవీల్ పోలీసులు పాల్గొన్నారు.