Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి
- వరంగల్లో ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఎల్ఎఫ్ బలపర్చిన బీఎల్పీ అభ్యర్థి శ్రీకాంత్ యాదవ్ను గెలిపించాలని సీపీఐ(ఎం) వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్లోని 24, 27 డివిజన్ల పరిధిలోని ఓఎస్ నగర్, పాపయ్యపేట, రఘునాథ్నగర్, రామన్నపేట, పోతననగర్, తదితర ప్రాంతాల్లో శనివారం శ్రీకాంత్ యాదవ్ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టగా వాసుదేవరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బీఎల్ఎఫ్ ముందుకు సాగుతోందని తెలిపారు. ఎమ్మెల్యేగా దాస్యం వినరుభాస్కర్ తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. మురికివాడల పట్ల చులకన భావంతో వ్యవహరించారని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు, తదితర అనేక హామీలు ఇచ్చి వాటిని విస్మరించినట్లు తెలిపారు. అపెరల్ పార్క్, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు సైతం అమలుకు నోచుకోలేదని చెప్పారు. బీఎల్ఎఫ్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి సుపరిపాలనకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీకాంత్యాదవ్ మాట్లాడారు. తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని తెలిపారు. మురికివాడల్లో నెలకొన్న అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని చెప్పారు. తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఉప్పలయ్య, సింగారపు బాబు, కుమార్, చుక్కయ్య, రంగరాజు విజయ, చెవుల శ్రీనివాస్, వీరస్వామి, పొలెపాక రాములు, మహ్మద్ షమీమ్, రేణుక, స్వరూప, చంద్రమౌళి, లక్ష్మణ్, మురళి, మేకల జయ, బరిగెల లక్ష్మి, నల్ల శ్రీనివాస్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.