Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపూర్
సుప్రసిద్ధ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మండలంలోని రామప్ప(పాలంపేట) రామలింగేశ్వర స్వామిని శనివారం హై కోర్టు జడ్జి రజనీ కుటుంబ సభ్యులతో సందర్శించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు హరీష్ శర్మ, ఉమా శంకర్లు జడ్జిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికి రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ గైడ్లో వెంకటేష్, విజరులు జడ్జికి రామప్ప ఆలయ విశిష్టత, శిల్ప కళ సంపదను వివరించారు. కాగా విహార యాత్రకు వచ్చిన విద్యార్థులతో హైకోర్టు జడ్జి ఫొటోలు దిగారు. అనంతరం సరస్సు వద్దకు చేరుకుని బోటులో విహారిస్తూ అందాలను అస్వాదించారు. ఈ కార్యక్రమంలో జడ్జి వెంట తహశీల్దార్ దేవాసింగ్, ఆర్ఐ రాజకుమారి, వీఆర్ఓ శంకర్, ఎస్సై నరహరి, సీవీలీ, సీఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నారు.