Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని పెద్దకొడెపాక శివారు బ్రాహ్మణ కుంట వద్ద దేవాదుల మొదటి విడత పైపులైన్ గేట్వాల్ లీకేజీ కావడంతో నీరు వృథాగా పోతున్నాయి. లీకేజీని అరికట్టాలని అధికారుల దృష్టికి తీసుకుపోయిన పట్టించు కోవడంలేదని పలువురు ఆరోపి స్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందిం చాలని పలువురు కోరుతున్నారు.
గణపురం : మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట మిషన్ భగీరథ పైపులైన్ లికేజీ అయ్యింది. దీంతో తాటి చెట్టు పై ఎత్తు వరకు నీరు ఎగిసి పడ్డాయి. చుట్టు పక్కల షాపుల్లోకి నీరు చొచ్చు కెళ్లడంతో షాపులు మూసి పరుగులు పెట్టారు. అతి వేగంగా నీరు ఒక్క సారిగా ఎగిసి పడడంతో విద్యుత్ తీగలకు తగులుకుని షాట్ సర్క్యూట్ అయ్యింది. ట్రాన్స్కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.