Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
జాతీయస్థాయి కళా ఉత్సవ్ పోటీలకు వరంగల్ పట్టణానికి చెందిన మార్గం వైష్ణవి ఎంపికైందని వరంగల్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9న నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్లో ప్రథమ బహుమతి గెల్చుకుని జాతీయ పోటీలకు ఎంపికైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వరంయలో సౌన్యంతో మాద్యమిక శిక్షా పథకం ద్వారా దేశంలోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహి స్తున్నట్టు తెలిపారు. హైదరా బాద్లోని సమగ్ర శిక్ష అభియాన్ గోదావరి ఆడిటో రియంలో నిర్వహించిన నృత్య పోటీలలో వైష్ణవి అత్యంత ప్రతిభ కనబరిచిందని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకులు శ్రీహరి, సంయుక్త సంచాలకులు రమేష్, లింగయ్య, సమన్వయ కర్త శ్రీనాథ్, ఏఎంవో తాజ్బాబు, శ్రీనివాస్, రంగారావు విద్యార్థిని మెమోంటో, శాలువతో సత్కరించి ఐదువేల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేశారు. జిల్లా విద్యాశాఖాధికారి, తల్లిదండ్రులు విద్యార్థినిని అభినందించారు.