Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-ధర్మసాగర్
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేస్తానని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం మండలంలోని రాంపూర్, నారాయణగిరి, ముప్పారం ధర్మసాగర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుడివెనుక దేవేందర్ ఆధ్వర్యంలో ఆత్మీయ ఆశీర్వాదసభ నిర్వహించారు. అనంతరం గ్రామాల్లోని ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాని, నియోజకవర్గానికి ఎమ్మెల్యే మూడుసార్లు పని చేశానని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. అనంతరం ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో చేసిన అభివద్ధి ప్రజలందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వల్లపురెడ్డి లక్ష్మి, వైస్ ఎంపీపీ కాలేరు కరమ్చంద్, జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులు కర్ర సోమిరెడ్డి, మల్కిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మేర వీరన్నరెడ్డి, జిల్లా నాయకులు ప్రభుదాస్, ఆకుల కుమార్, నిమ్మ కవితరెడ్డి, కొలిపాక రమ, కో ఆప్షన్ సభ్యులు లాల్ మొహమ్మద్, చాడ కుమార్, మేర హరీష్, మాజీ సర్పంచ్లు పులిపాక రజిత, రమేష్ పాల్గొన్నారు.
కాజీపేట రూరల్ : టీఆర్ఎస్ గెలుపుతోనే నియోజకవర్గం మరింత అభివృద్ది చెందుతుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 34వ డివిజన్ రాంపూర్లో ఆశీర్వాద ప్రచారయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పువాయిద్యాలతో, ఆటపాటలతో కోలా టాలు ఆడుతూ మంగళహారతులతో స్వాగతం పలికారు.