Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ చీఫ్విప్ గండ్ర వెంకటరమణరెడ్డి
నవతెలంగాణ-టేకుమట్ల
రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరంకుశ నియంతృత్వ పాలనను అంతమొందిచాలని మాజీ చీఫ్విప్ గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కుందనపల్లి, గుమ్మడవెల్లి, ఆరెపల్లి, రాఘవరెడ్డిపేట గ్రామాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధి గురించి వివరించారు. కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని తీవ్రంగా విమర్శించారు. పేదలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డి మల్లారెడ్డి, నాయకులు, బందెల నరెష్, సట్ల రవి, సంపత్రావు, లక్ష్మణ్, కుర్రె మల్లయ్య, బాబురావు, రవీందర్, లింగారెడ్డి, అన్వర్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అక్రమ్, సతీష్, కుమారస్వామి పాల్గొన్నారు.
శాయంపేటలో : ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పతనం తప్పదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ చీఫ్విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దకొడపాక గ్రామాల్లో శనివారం సీనియర్ నాయకులు అబ్బు ప్రకాశ్రెడ్డి మాజీ చీఫ్విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.