Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
నవతెలంగాణ-మహాదేవపూర్
టీఆర్ఎస్ పాలనతోనే పేదల కుటుంబాల్లో వెలుగు నిండుతాయని తాజామాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని సూరారం గ్రామంలో నిర్వహించిన మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నాలుగున్నరేండ్లుగా చేసిన అభివృద్ధి పనులకు అకర్షితులై పలువురు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించేలా అధికారులతో మాట్లాడి న్యాయం చేశానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తనను మళ్లీ ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీపతి బాపు, ఎంపీపీ వెన్నపురెడ్డి వసంత, మార్కెట్ కమిటీ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాస్రావు, నాయకులు బాలాజీరావు, ప్రకాష్, కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి, సూరారం గ్రామశాఖ అధ్యక్షులు చల్లా రాజిరెడ్డి, నాయకులు నాగుల లక్ష్మారెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డితో పాటు బెగ్లూర్, రాపెల్లికోట, ఏన్కపల్లి, అంబట్పల్లి, కిష్టారావుపేట గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.