Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
మండల కేంద్రం చెన్నారావుపేట గ్రామంలో అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ చివరి రోజు కావడంతో ఉత్కంఠల మధ్య మంగళవారం ఉపసంహరణ అయ్యింది. ఈ నెల 16 నుంచి 18 వరకు అధికారులు నామినేషన్ స్వీకరించగా అదే గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ ప్రారంభం నుంచే మండల కేంద్రానికి ఎలాగైనా సర్పంచ్ను టీఆర్ఎస్ కైవసం చేసుకోవలానే సంకల్పంతో ఆరు రోజులుగా బుజ్జగింపులు, బేరసారాలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి రిటైర్డు ఎస్సై రాధారపు సంజీవరెడ్డి గెలుపే లక్ష్యంగా రెండ్రోజులుగా గ్రామాల్లో కొంతమంది గ్రామస్థులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు అప్రమత్తమై నామినేషన్ చివరిరోజు 19 మందిని చివరకు ఉపసంహరణ చేయించారు. చివరకు ఒక అభ్యర్థి పోటీలో ఉండడంతో ఆ అభ్యర్థిని ఎలాగైనా తప్పించాలనే ప్రయత్నంలో సమయంలోపే ఉపసంహరణ చేయాలంటూ కొంతమంది గ్రామస్థులు ఆర్వో, ఏఆర్వో అధికారులను ప్రశ్నించడంతో స్వల్ప గొడవకు దిగారు. ఘటన స్థలాన్ని ఎస్సై జగదీశ్ చేరుకుని గొడవను సద్దుమ నిగించారు. చివరకు టీఆర్ఎస్ అభ్యర్థిగా కుండె మల్లయ్య, స్వతంత్ర అభ్యర్థి సంజీవరెడ్డి పోటీలో నిలుస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. టీఆర్ఎస్ నాయకులు ఏకగ్రీవ ప్రయత్నం విఫలమైందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా చెన్నారావుపేట సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారడంతో పాటు రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి సంజీవరెడ్డి గట్టి పోటీలో నిలుస్తాడా లేదా అని వేచి చూడాలి.