Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మామునూర్
బొల్లికుంటలోని వాగ్ధేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మంగళవారం సెమినార్ నిర్వహించారు. ''ఆటోమోబైల్ పరిశ్రమ ఒక అవగాహన'' అనే అంశంపై మెకానికల్ విభాగం వారు ఈ సదస్సు నిర్వహించారు. మదూస్ గ్యారేజీ ఈక్విప్మెంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అతీత్ తేనుకుంట్ల ముఖ్య అతిధిగా పాల్గొని ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోమోబైల్రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, సరైన అవగాహనతోనే ఉద్యోగ అవకాశాలు సాధించవచ్చని అన్నారు. వాతావరణ మార్పుల ఫలితంగా పెట్రోల్, డిజిల్ ఆధారిత వాహనాల ఉత్పత్తిరంగం తగ్గనుందని, రానున్న 40 సంవత్సరాల వరకే ఈ రంగం ఉనికి పరిమితమయ్యిందని, భవిష్యత్కాలంలో విద్యుత్ వాహనాల ఉత్పత్తిరంగం పెరగనున్న నేపథ్యంలో ఆటోమోబైల్ పారిశ్రామికరంగం విస్తరిస్తుందన్నారు. అందువలన ఆటోమోటివ్ ఇంజనీరింగ్ ప్రాధాన్యత పెరిగి అపారమైన అవకాశాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో హైబ్రిడ్ వెహికిల్స్ తయారీ, డ్రైవర్ రహిత వాహనాల తయారీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రైవింగ్ భద్రత చర్యలు తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సదస్సు నిర్వహించిన నిర్వాహాకులను కళాశాల యాజమాన్యం డాక్టర్ సీహెచ్ దేవేందర్రెడ్డి, డాక్టర్ సీహెచ్ సత్యపాల్రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ప్రకాష్, డీన్ డాక్టర్ ఎ.చంద్రమౌళి, మెకానికల్ విభాగాధిపతి, సదస్సు కన్వీనర్ డాక్టర్ పి. శ్రీనివాసులు, సదస్సు కోఆర్డినేటర్ డాక్టర్ పరమేష్కుమార్, ఉమాశంకర్ పాల్గొన్నారు.