Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట రూరల్
గురుకుల సైనిక్ సీఈఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడగించినట్లు వరంగల్ అర్బన్ జిల్లా సమన్వయ అధికారి, మడికొండ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ సీఈఓ కళాశాలలో 2019-20 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ప్రవేశానికి ఈనెల 23లోపు దరఖాస్తు చేసుకొనుటకు నోటిఫికేషన్ విడుదల చేయగా 27కు పొడగించినట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఫిబ్రవరి 17న ఉంటుందని తెలిపారు.