Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై సజ్జనపు శ్రీధర్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన లోకిని సమ్మయ్య (55) కొంతకాలం దుబారుకి వెళ్లి అక్కడ పని చేసి ఇండియాకి తిరిగొచ్చాడు. గతంలో చేసిన అప్పులు పూర్తిగా తీరకపోవడంతో కొద్దిరోజులుగా మళ్లీ దుబారుకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు గమనించి జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పరిస్థితి విషమించి మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి కుమారుడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.