Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
ధర్మసాగర్ గ్రామ సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రానికి జరిగిన ఎన్నికల్లో రికార్డు సష్టించారు. టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచి ఘనవిజయం సాధించారు. సర్పంచ్ ఎన్నికలో నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ నడుమ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిపై 831 ఓట్ల మెజార్టీతో ఎర్రబెల్లి శరత్ విజయం సాధించారు. శరత్కు 5732 ఓట్లలో 2223 పోలవగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్రపు ప్రసాద్కు 1297, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన కొలిపాక రజితకు 1260, బీజేపీ అభ్యర్థి అయిన కూనూరు రాజుకు 875 లభించాయి. ఎర్రబెల్లి శరత్ టీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ఏ పదవి లేకపోయినా ఐక్యంగా అతని కుటుంబం రాజకీయ పలుకుబడితో సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా టిఆర్ఎస్ మండల పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం కలిగింది. ఇంతవరకు ధర్మసాగర్ గ్రామ పంచాయతీ చరిత్రలో అధికార పార్టీకి చెందిన ఏ అభ్యర్థి కూడా గెలిచిన దాఖలాల్లేవు. రాష్ట్ర తొలి సర్పంచిగా ఘన విజయం సాధించిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఉప సర్పంచ్గా బొడ్డు అరుణ ఎన్నిక
ఉత్కంఠగా సాగిన ధర్మసాగర్ గ్రామ ఉపసర్పంచ్గా బొడ్డు అరుణ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు.