Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
మండల కేంద్రంలోని అంగడి అక్రమ దందా అరికట్టాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు శనిగరం వెంకటేష్ ఆధ్వర్యంలో తహశీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ ఇందుమతికి మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడారు. బినామీ పేర్లతో అంగడి యజమానులు ఒక్కో గొర్రె, మేక కొనుగోలుపై రూ.150-200లు వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న క్రమంలో సదరు టెండర్లు రద్దు చేసి అక్రమ దందా అరికట్టడంతోపాటు మళ్లీ సంత వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.