Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
మండలంలో పంచాయితీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.ఈ నెల 25న రెండోవిడుత పంచా యతీ ఎన్నికలు జరుగ నుండటంతో గెలుపు దీమాతో మహాకూటమి, టీఆర్ఎస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండలంలో జరు గు తున్న పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బల ప ర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతూ ఖమ్మం ఎమ్మెల్సీ బా లసాని లక్ష్మీనారాయణ గ్రామాల్లో ప్రచారం నిర్వహి స్తున్నారు. టీఆర్ఎస్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథóకాలు , ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్రా మాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రజలకు వి వరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. వెంక టాపురం మేజర్ గ్రామపంచాయితీ సర్పంచ్ పోటీలో ఉన్న పూనెం నాగలక్ష్మి గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షకార్యధర్శులు వేట్పూరి లక్ష్మినారాయణ, గంపా రాంబాబు, సీనియర్ నాయకులు బాలసాని ముత్తయ్య, బాలసాని మధు, శ్రీనివాసరావు, ప్రసాద్, శివాజీ , నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.
విద్యావంతురాలును గెలిపించుకోండి
మరోవైపు మహాకూటమి తరుపున బరిలోఉన్న ్ అభ్యర్థినిగాచిడెం యామిలిని గెలిపించి పంచాయితీ అభివృద్ధ్ది కి బాటలు వేసు కోవాలని మహాకూటమి నా యకులు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఎవరికి ఇచ్చిందో చూపెట్టాలని సవాల్ విసిరారు. ఓట్ల కోసం విచ్ఛల విడిగా హామీలు ఇవ్వడం టీఆర్ఎస్ నాయకులకు అల వాటైందన్నారు. టీఆర్ఎస్ మాటలు విని మోస పోవద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అచ్చా నాగేశ్వరరావు, సుందర్ రావు, మంగాయమ్మ, బాషా, రమేష్, గణపతి, ి ప్రసన్న, ్దకిరణ్తదితలు పాల్గొన్నారు.