Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాజేడు
జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. మంగళ వా రం మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు దాట్ల సీతా రామరాజు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశానికి ఎ మ్మెల్యే వీరయ్య హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. అన్ని పథకాలు పూర్తి కా కుండా మిగిలి పోయాయన్నారు. కాంగ్రెస్ పార్టీనే ఈ దేశా నికి దశాదిశ అని, కాంగ్రెస్ పార్టీ లేనిది టీఆర్ఎస్ లేదన్నారు. ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నాయకులు వాత్సవాయి జగన్నాథరాజు, పూ నెం రాంబాబు, సుధాకర్, తల్లడి ఆదినారాయణ, బొల్లె డెనార్జన్ తదితరులు పాల్గొన్నారు.