Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
గ్రామపంచాయతీ ఎన్నికల ఉపసంహరణలు మంగళవారం ముగియడంతో మండలంలోని 25 గ్రామపంచాయతీలలో 87 మంది సర్పంచ్, 397 మంది వార్డు సభ్యులు ఎన్నికల రంగంలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అసిస్టెంట్ అధికారి, ఎంపీడీఓ బీంరెడ్డి రవీంద ర్రెడ్డి తెలిపారు. మండలంలోని మంగపేట క్లసర్లోని కమలాపురం, మంగపేట, కోమటిపల్లి, కొత్తూరు మొ ట్లగూడెం గ్రామపంచాయతీలలో 6 గురు సర్పంచ్, 13 మంది వార్డు సభ్యులు నామినేషన్లు ఉపసంహ రించుకోగా 19 మంది సర్పంచ్, 85 మంది వార్డు సభ్యులు ఎన్నికల బరిలో ఉన్నారు. కమలాపురంలో ఒ క్కరు, కోమటిపల్లిలో ఒక్కరు, కొత్తూరు మొట్లగూడెంలో 7 గురు వార్డు సభ్యులు ఏకగ్రీవ మjయ్యారు. తిమ్మంపేట క్లస్టర్లోని నర్సాపురంబోరు, చె రుపల్లి, తిమ్మంపేట, బుచ్చం పేట, బాలన్నగూడెం, నర్సా యి గూడెం గ్రామ పంచాయతీలలో 6 గురు సర్పంచ్, 11 మంది వార్డు సభ్యులు నామినేషన్లు ఉప సంహ రించు కోగా 13 మంది సర్పంచ్, 100 మంది వార్డు సభ్యులు ఎన్నికల బరిలో ఉన్నారు. నర్సా యిగూడెం సర్పంచ్, 6 గురు వార్డు సభ్యులతో పాటు చెరుపల్లిలో 4 గురు వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు.మల్లూరు క్లస్టర్లోని మల్లూరు, కొత్తమ ల్లూరు, నర్సింహాసాగర్, పూరెడుపల్లి, చుంచుపల్లి గ్రామపంచాయతీలో 8 మంది సర్పంచ్, 11 మంది వార్డు సభ్యులు నామి నేషన్లు ఉపసంహ రించుకోగా 16 మంది సర్పంచ్, 64 మంది వార్డు సభ్యులు ఎన్నికల బరిలో ఉన్నా రు.మల్లూరులో 8, కొత్తమల్లూరులో 1, నర్సింహాసాగర్లో 1, చుంచు పల్లిలో 2 వార్డులు ఏకగ్రీ వమయ్యాయి. రాజుపేట క్లస్టర్లోని వాడగూడెం, రమణక్కపేట, రాజుపేట, రామచంద్రునిపేట, వాగొడ్డుగూడెం గ్రామపంచా యతీలో 3 గురు సర్పంచ్, 23 మంది వార్డు సభ్యులు నామినేషన్లు ఉపసంహ రించుకోగా 17 మంది సర్పంచ్, 72 మంది వార్డు స భ్యులు బరిలో ఉన్నారు. వాడగూడెంలో 6 గురు, రా జుపేటలో 7 గురు వార్డు సభ్యులు ఏకగ్రీ వమయ్యారు. బ్రాహ్మణపల్లి క్లస్టర్లోని దోమెడ, నిమ్మ గూడెం, కత్తిగూడెం, బ్రాహ్మపల్లి, అకిఏపల్లి మల్లారం గ్రామ పంచాయతీలో 8 మంది సర్పంచ్, 10 మంది వార్డు సభ్యులు నామినేషన్లు ఉప సంహరించుకోగా 22 మంది సర్పంచ్, 76 మంది వార్డు సభ్యులు ఎన్నికల బరిలో ఉన్నారు. నిమ్మగూ డెంలో 5 గురు, కత్తిగూ డెంలో ఒక్కరు వార్డు సభ్యులు ఏకగ్రీవమై తుది పోరులో 87 మంది సర్పంచ్, 397 మంది వార్డు సభ్యులు ఎన్నికల రంగంలో ఉన్నట్లు జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అధికారి రవీందర్రెడ్డి తెలిపారు.