Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మూడో విడత పంచాయతీ ఎన్నికల ఉపసంహరణ మంగళవారం ముగియ డంతో నేటి నుంచి అభ్యర్థులు ముమ్మ రంగా ప్రచారం మొదలు పెట్టేందుకు సన్నద్ధం అయ్యారు. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఉదయం నుంచి ఓటర్ల వద్దకు పరుగులు పెట్టేందుకు సిద్ధం అయ్యారు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుండే పల్లెల్లో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతు న్నాయి. రిజర్వేషన్లు కేటాయిం చిన తర్వాత మరింత వెడి ఎక్కాయి. మండలంలోని 18 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులుగా 63 మంది, 152 వార్డులకు 287 మంది వార్డు సభ్యలు బరిలో ఉన్నారు. అభ్యర్థుల బరిలో ఎమ్మెల్యే స్థాయి నుంచి చోటమోట నాయ కులతో బుజ్జగింపులు జరిపినా మంగళ వారం కొనసాగిన ఉప సంహ రణలో సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యు లు యాథావిధిగా బరిలో ఉన్నారని అధికా రులు తెలిపారు. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు సైతం కేటాయిం చడంతో వారి ప్రచారం ముమ్మరం చేసేం దుకు సమాయత్తం అయ్యారు. పల్లెల్లో సర్పంచ్ గిరి గెలుపు కోసం నువ్వా నేను అన్నట్టుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
సమరం రసవత్తరం
రాజకీయ నాయకుల మాదిరిగానే ఓటర్లు కూడా తమ పంతాను మార్చుకున్నారు. తమకు ఈ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని వచ్చే అభ్యర్థులకు హామీలు ఇస్తూ వారు ఇచ్చింది పుచ్చుకుంటున్నారు. డబ్బులు పోతే కానీ అసలు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియక అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. తమ గుర్తులు తెలియడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకు నేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఓటరుకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల వేళ మద్యం ఎరులై పారుతుంది. అభ్యర్థులు ఇప్పటికే తమ ఇండ్లలో భారీగా మద్యం నిల్వలు చేసుకుంటున్నట్టు తెలు స్తుంది. పంచా యతీ ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపి ణీని అడ్డుకునేందుకు ప్రయత్ని స్తున్నట్టు తెలిసింది. మండలంలో నార్లాపూర్, తాడ్వాయి, కాటాపూర్ తదితర గ్రామాలు పెద్ద గ్రామ పంచాయతీలు కావడంతో ఈ పోటీ మరింత తీవ్రంగా ఉంది. వార్డు సభ్యులు రూ.50వేల వరకు, సర్పంచ్లు రూ.5లక్షల వరకు మించి ఖర్చు చేయను న్నట్టు తెలుస్తుంది. ఎన్నికల ముందు వైన్స్ షాపుల మూసి వేయడంతో ముంద స్తుగానే నిల్వ చేసుకున్న మద్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లకు చేరే వేసేందుకు సన్నద్దం అవుతున్నారు. ఇదే అదనుగా ప్రతి ఒక్కరి ఆయా ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తెల్లవారక ముందే వాలి పోతున్నారు. తమ అనుచర గణాన్ని చౌకందేకు అభ్యర్థులు నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఎన్నడూ లేని విధంగా పోటీ నెలకొనడంతో ఒక్కొక్క ఓటరుకు బస్సు చార్జీలతో కొంత సొమ్ము ముట్ట చెబుతామని చెబుతూ తీసుకువ స్తున్నారు. తమ బవిష్యత్ 30న తెలుతు ందని తెలియడంతో అభ్యర్థులు పాడరాని పాట్లు పడుతున్నట్టు తెలుస్తుంది.