Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
నేటి యువతకు స్ఫూర్తిగా పాపయ్యపల్లి సర్పంచ్ దారవత్ రాకేష్ నిలువనున్నారు. మండలంలోని పాపయ్యపల్లి సర్పంచ్ అభ్యర్థిగా దారవత్ రాకేష్ ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి డిగ్రీ వరకు విద్యను అభ్యసించి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం చొరవ చూపుతున్న తనను ప్రజలు ఆదరించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. గతంలో ఈ గ్రామం పస్రా పంచాయతీ పరిధిలో ఉండేదని, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో నూతన పంచాయతీగా పాపపయ్యపల్లి ఆవిర్భవించిందన్నారు. ఈ నూతన పంచాయతీకి నూతన సర్పంచ్గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో తనపై బాధ్యత పెరిగిందన్నారు. ఎన్నికలకు ముందే గ్రామంలో సీసీ రోడ్లు, 200 మీటర్ల సైడ్ డ్రెయినేజీల ఏర్పాటుకు మాజీ మంత్రి చందూ లాల్తో మాట్లాడి మంజూరు చేసు కోవడం జరిగిం దన్నారు. ప్రతి వీధికి విద్యుత్ లైన్ ఏర్పడే విధంగా ట్రాన్స్కో అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా లైన్లు వేయించడం జరిగిందన్నారు. ఈ తరుణంలో ఎన్నికలు రావడంతో గ్రామస్తులు గ్రామ సమస్యలపై కృషి చేస్తున్న తనను గుర్తించి సర్పంచ్గా ఎన్నుకున్నారని తెలిపారు. ఈ ఎన్నికతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, బాధ్యతగా వ్యవహరించి పదవికి వన్నె తీసుకువచ్చి గ్రామస్తుల నమ్మకాన్ని నిలబెడుతానన్నారు. మరికొన్ని సీసీ రోడ్లు, డ్రాయినేజీ పనులు, తాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రైతు బంధు పథకం వర్తించని రైతుల భూములకు పట్టాలు అందించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అర్హులైన ఉండి పెన్షన్లు పొందని వారికి ఆసరా పెన్షన్లు, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రధానంగా స్మశానవాటిక లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా కానీ, దాతల ద్వారా కానీ కృషి చేసి గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటు పడుతానని తెలిపారు. మండలంలో పాపయ్యపల్లిని ఉత్తమ పంచా యతీకిగా గుర్తి ంపు తీసుకు వచ్చే ందుకు నిరంతరం శ్రమి స్తానని తెలిపారు.