Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భూపాలపల్లి టౌన్
అటవీ భూముల గుర్తింపు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదే శించారు. మంగలవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అటవీ, రెవెన్యూ భూమి కొలతల శాఖల అధి కారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో అటవీ భూముల గుర్తింపు పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని కానీ వాటిలో రెవెన్యూ, అటవీ శాఖల మద్యల ఉన్న రికార్డుల ఆధారంగా వివాదంలో ఉన్న భూమి ఎవరికి చెందినదో ఇప్పటకీ గుర్తించకపోవడంతో గందరగోళంగా ఉందన్నారు. వివాదంలో ఉన్న భూమిని గుర్తించి త్వరగా పరిష్కరించి ప్రభ్వుంకు వివరాలు అందించాలని తెలిపారు. ప్రభుత్వం ఆదేశించినందుకు జిల్లా లోని మండలాల వారీగా తహశీల్దార్లు అటవీ శాఖ రేంజ్ అధికారులు, ల్యాండ్ సర్వేయర్లు ఈ నెల 23, 27, 28 తేదీలలో తహశీీల్దార్ కార్యాలయంలో సమా వేశం అయి రెవెన్యూ, అటవీ శాఖల వద్ద రికార్డుల ప్రకారం ముందు ఎలాంటి వివరాలు లేని అటవీ శాఖ భూమిని గుర్తించి నివేదిక సిద్దం చేయాలన్నారు. అలాగే రెవెన్యూ రికార్డులలో, అటవీ శాఖ రికార్డులలో ఉన్న తే డాల ప్రకారం వివాదంలో ఉన్న భూమి విస్తీర్ణం గుర్తించా లన్నారు.ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ ప్రదీప్ శెట్టి, ఆర్డిఓ రమాదేవి ల్యాండ్ సర్వే ఏడి సుదర్శన్, వజ్రారెడ్డి అధికారులు పాల్గొన్నారు.