Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -మొగుళ్లపల్లి
భారతరాజ్యాంగ ద్వారా అనేక హక్కులు కల్పించి దేశా నికి దిశానిర్దేశనం చేసిన మహనీయుడు డా.బి.అర్ అంబే ద్కర్ అని దళిత్ శక్తి ప్రోగ్రాం మండల కన్వీనర్ జన్నే లక్ష్మణ్ మహరాజ్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ఎమ్ఈఓ కార్యాలయంలో జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ దేశ పీడిత ప్రజల విముక్తి దినంగా భావిస్తూ రాజ్యాంగ పీఠిక లో ఉన్న వాక్యాన్ని చదివి వినిపించాలని కోరుతూ ఎమ్ఈఓ ప్రభాకర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ రిపబ్లిక్ డే రోజున జాతీయ జెండా కింది భాగంలో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బండారి కుమార్, వంశీ, అశోక్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.