Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూ దనాచారి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన మాజీ స్పీకర్ మాట్లాడుతూ భూపా లపల్లి నియోజకవర్గానికి రూ.350 కోట్లు నిధులు తీసు కువచ్చి ఎంతో అభివృద్ధి చేశా నన్నారు. ప్రజలకు తాను చేసిన అభివృద్ధి నచ్చ లేదన్నారు. దీంతో గండ్ర వెంకట రమణారెడ్డిని గెలిపించుకున్నారని తెలిపారు. తాను పల్లె నిద్రలు చేస్తూ మంచి చెడుకు గ్రామాలు పట్టుకుని పర్య టించినా ప్రజలు ఆదరించ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ఓటమి చెందిన తర్వాత ప్రజలందరూ బాధ పడుతున్నారని తెలిపారు. ఏది ఏమైనా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని, ఓడిన పది రోజుల నుండే నిరుత్సాహ పడకుండా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచు కుంటున్నానని తెలిపారు. తనకు గణపురం మండలంలో 17 పంచా యతీల్లో సర్పంచ్ లును గెలిపించి బహు మతిగా అందించాలని కోరారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేసి సర్పంచ్ అభ్యర్థులను గెలి పించాలని తెలిపారు. గణపురం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా జంగిలి శ్రీనివాస్రావును అ త్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలు పునిచ్చారు. తాను ఓటమి చెందినా గణ పురం మండలాన్ని అభివృద్ధి చేస్తాన న్నారు. గణప సముద్రం చెరువులోకి రిజర్వాయర్, ధర్మ రావుపేట మోరంచ వాగుపై రెండవ బ్రిడ్జి, సీసీ రో డ్లు తదితర అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ మోటపోతుల శివ శంకర్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివి.ప్రసాద్ నాయు డు, నా యకులు కోల జనార్థన్, గర్రెపల్లి శివశంకర్, బైరగాని కుమారస్వామి, పాపరావు, రైతు సంఘం మండల అధ్య క్షుడు లక్ష్మణ్రావు, ముక్కెర సాయిలు, సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాసరావు, నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు.