Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపలపల్లి టౌన్
నానాటికీి అంతరించి పోతున్న వృక్షసంపదను వృద్ధ్దిచేయడానికి తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఒక వరం అని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంక టేశ్వర్లు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రానున్న వర్షకాలంలో జిల్లాలో మొక్కలు నాటడానికి తెలంగాణకు హరితహరం కార్యక్రమం నర్సరీల ఏర్పాటుపై అటవీ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధ్ది శాఖల అధికారులతో మంగ ళవారం జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు హరి తహారం కార్యక్రమం ద్వారా జిల్లా లో నాటడానికి రెండు కోట్ల ఏడు లక్షల మొక్కలను సిద్ధ్దంచేయాలని అది óకారులను ఆదేశించారు. మన జిల్లా లో అటవీ భూమి విస్తీరణం అధికంగా ఉన్నందున హరితహారం కార్య క్రమం ద్వారా అధిక శాతం మొక్కలు నాటే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి , భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూలు, అదిలాబాద్ జి ల్లాలలో మొక్కలు నాటేందుకు అధికంగా అవకాశం ఉన్న ందున ఈ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యేక శ్రద్ధతో హరితహార కార్యక్రమం పర్యవే క్షిస్తున్నారని తెలిపారు. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంను జిల్లా లో విజయవంతంగా నిర్వహిం చాలన్నారు. ఇందుకు గాను జిల్లా లోని అన్ని గ్రామ పంచా యతిలలో నర్సరీలను ఏ ర్పాటు చేయాలన్నారు. ము ఖ్యంగా డీఆర్డీఏ ద్వారా మూడు వందల గ్రామ పంచా యతీలలో , మిగతా గ్రామ పంచాయతీల్లో అటవీ శాఖ ద్వారా నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచా లన్నారు. జిల్లాలో అటవీ భూమి శాతం అధికంగా ఉన్నందున 40% టేకు మొక్కలను ఉత్పత్తి చేయాలని ఇంటి ఖాళీ స్థలాలలో, రోడ్ల ప్రక్కన, పొలాల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలు, చెరువు గట్ల పై మొక్కలను పెంచుటకు గ్రామసభలు నిర్వహించి స్థానిక డిమాడ్ల ఆదారంగా నర్సరీలలో మిగతా మొక్కలు పెంచాలన్నారు. నర్సరీల పెంపకం పై అవగాహన కల్పించుటకు ఫిబ్రవరీ మొదటి వారంలో ఎంపీడీఓలు, ఈజీఎస్ ఏపీఓలు , ఫారెస్ట్ రేంజ్ అధికారులు, సంభందిత శాఖల అధికారులకు డిఆర్డిఏ ద్వారా ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని డిఆర్డిఏ సంజీవరావును కలెక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి ప్రదీప్ శెట్టి, ములుగు ఆర్డిఓ రమాదేవి, ఎఫ్డిఓలు సారయ్య, వజ్రారెడ్డి , ఎఫ్ఆర్ఓలు తహశీల్దార్లు పాల్గ్గొన్నారు.