Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
గణపురం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు వర్గానికి చెందిన చెలుమల్ల సంపత్ను ప్రక టించారు. మంగళవారం నామినేషన్ల ఉప సంహరణ ఉండడంతో సత్యనారాయణరావు వర్గం నుండి నలుగురు సర్పంచ్ అభ్యర్థులు నామి నేషన్లు వేశారు. చెలుమల్ల సంపత్ను నియమించినట్లు గండ్ర సత్యనా రాయణరావు తెలిపారు. మండల కేంద్రంలో వైద్యవృత్తి కొనసాగిస్తున్న సంపత్ మండలంలో మంచి పేరు ఉంది. దీంతో సంపత్ మంగళవారం ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపురం మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తానన్నారు. ఇప్పటి వరకు ప్రజలకు వైద్య వృత్తి ద్వారా ప్రజా సేవ చేశానని, రాజకీయాల్లోకి వచ్చి అందరికి అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానన్నారు. తన గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.