Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
టీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని, టీఆర్ఎస్ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఎంపీపీ బానోతు సారంగపాణి అన్నారు. మండలంలోని ఆసరవెల్లి గ్రామంలో మంగళవారం సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నుంచి పార్టీలో చేరిన వారు కడ్దూరి రవి, ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శి కడ్డూరి శోభ, పీవోడబ్ల్యూ జిల్లా సభ్యులు కడ్దూరి మహేశ్, పీవైఎల్ డివిజన్ నాయకులు పెంతల స్వామితో పాటు పలువురు టీఆర్ఎస్లో చేరగా వారిని ఆహ్వానించి మాట్లాడారు. ఆసరవెల్లి గ్రామాన్ని రంగయ్య చెరువు ప్రాజెక్టు ముంపునకు గురికాకుండా చూసి కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసిన ఘనత నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికే దక్కిందని దీన్ని గమనించి ప్రతీ ఒక్కరూ టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడ్డ రాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అత్యధిక నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ది చేస్తాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు ఊడ్గుల ప్రవీణ్ గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు.