Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నర్సంపేట ఏసీపీ సునితా మోహన్ అన్నారు. పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు టాలెంట్ టెస్టును నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రూరల్ జిల్లా కార్యదర్శి దిడ్డి పార్థసారథి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. విద్యార్థులు విద్యను కష్టపడి కాకుండా ఇష్టంతో చదవాలని అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోస్తారని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత విద్య, నైపుణ్యత సాధించే వారే ఉద్యోగాలకు అర్హత సంపాదిస్తారన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ కళాశాల డైరెక్టర్ గోగుల ప్రభాకర్ రెడ్డి, కాకతీయ కళాశాల ప్రిన్సిపాల్ వీరమల్ల మాధవరెడ్డి, ఏవో వీరారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అనిల్, రవి, విష్ణు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.