Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
సుదూర ప్రాంతాల నుండి పట్టణానికి చదువు కోసం వస్తున్న విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సైకిళ్లను రోటరీ క్లబ్ అధ్యక్షులు దామెరశెట్టి ఉత్తరయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర, బాలికల పాఠశాలలో దూర ప్రాంత విద్యార్థులకు పాఠశాలకు నిర్ణీత సమయంలో చేరుకోవడం కోసం సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 24 సైకిళ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో దేవా, క్లబ్ జిల్లా బాధ్యులు అసిస్టెంట్ గవర్నర్ దార శ్రీనివాస్, ప్రాజెక్టు కోఆర్డినేటర్ తోల వైద్యనాథ్, జిల్లా సమన్వయకర్త రాదారపు జయపాల్రెడ్డి, నర్సంపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీరాం కిరణ్, కోశాధికారి చకిలం కృష్ణమూర్తి, సభ్యులు పాల్గొన్నారు.