Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
పట్టణంలోని సరోజినిదేవి రోడ్లో గల పురుషుల పొదుపు సంఘంలో గతంలో పొదుపు సభ్యులైన పూరేటి కుమారస్వామి (50), తాబేటి బాబు (47)లు మరణించారు. సంఘంలో పొదుపు సభ్యులైనందున సంఘ అధ్యక్షులు బత్తిని రాజేందర్, సమితి అధ్యక్షులు మేడిది రవి ఆధ్వర్యంలో విపత్సహాయం పొంది మంగళవారం మృతులకు కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.25 ఒక్కొక్క కుటుంబానికి మొత్తం రూ.50వేలను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పుల్లూరి మోహన్, పాలకవర్గం తిరుపతి, రాజలింగం, రమేష్, శివకుమార్, సురేష్ పాల్గొన్నారు.