Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
మండలంలోని అమీనాబాద్ గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో ఈనెల 23, 24, 25 తేదీల్లో జోనల్ స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహిస్తున్నట్టు పాఠశాల హెచ్ఎం ప్రసన్న లక్ష్మీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు మూడు రోజులు నిర్వహిస్తామని 11 పాఠశాలలకు చెందిన 150 మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ సంపత్ రావు, కోఆర్డినేటర్ సుమన్ హాజరుకానున్నట్లు తెలిపారు.