Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
ఇన్చార్జి ఎంపీపీగా వైస్ ఎంపీపీ శోంటి శారద మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్రావుపై మెజార్టీ ఎంపీటీసీలు ఈ నెల 11న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణం నెగ్గింది. దీంతో ఎంపీపీ పదవీ ఖాళీ అయ్యింది. ఎంపీపీని ఎన్నుకునే వరకు వైస్ ఎంపీపీగా ఉన్న శారదను ఇన్చార్జి ఎంపీపీగా బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అందడంతో ఎంపీడీవో నుంచి ఇన్చార్జి ఎంపీపీగాబాధ్యతలు తీసుకున్నారు.