Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వర్ధన్నపేట
మొదటి విడతలో నిర్వహించిన పంచాయతీ ఎన్నిక లలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్న అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన వర్ధన్నపేట, ఐనవోలు, పర్వతగిరి మండలాలకు చెందిన నూతన సర్పంచ్ మరియు వార్డు సభ్యులందరు వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నిక కాబ డిన సర్పంచ్ ఉప సర్పంచ్ లను ఆయన అభినందిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సమస్యలను పరిష్కరిస్తూ గ్రామ అభివృద్ధికి పాటుపడాలని ఆయన అన్నారు. సర్పంచ్ ఎల్లవేళలా ప్రజ లకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. మనం చేసిన మంచి పనులే మళ్లీ మనలను గెలిపించే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజల అవసరాలు గుర్తిస్తూ వాటిని పరిష్క రించేందుకు నిరంతరం కృషిచేయాలన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు ఎమ్మెల్యే రమేష్ ఎంపీపీ మార్నేని రవీందర్రావు లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట అయినవోలు పర్వతగిరి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మార్గం బిక్షపతి మునగాల సమ్మయ్య రతన్ రావు పార్టీ అధికార ప్రతినిధి మిద్దె పాక రవీందర్, ఎంపీటీసీలు గుడిసెల శ్రీనివాస్ బొంపల్లి మధు గౌడ్ వర్ధన్నపేట రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ మోహన్ రావు జిల్లా నాయకులు గుజ్జ గోపాలరావు, నూతనంగా ఎన్నికైన మూడు మండలాల సర్పంచులు ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.