Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరకాల రూరల్
గ్రామాల అభివృద్ధి టీిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సర్పంచ్ ఎన్ని కల అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాల నియోజకవర్గం లోని నడికుడ మండ లంలోని రామకృష్ణపురం, కంఠాత్మకూరు, నడికుడ, చౌటుపర్తి, ముస్తలపల్లి, లక్ష్మీపురం, వెంకటాపురం గ్రామాలలో ప్రచారాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గ్రామాలలోని టీిఆర్ఎస్ అభ్యర్థుల తో గ్రామాలలో తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన స ర్పంచిగా పోటీ చేసే అభ్యర్థులకు ఈనెల 25న జరిగే ఎన్ని కలలో భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. టిఆర్ఎస్ పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలు ఎవరు అధైర్యప డవద్దని సర్పంచ్ అభ్యర్థికి ఆశపడిన నాయకులను అన్ని విధా లుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా టీిఆర్ఎస్ పార్టీ నుండి రెబల్గా పోటీ చేసే అభ్యర్థులు విరమించు కోవాలని సూచించారు. అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని అందుకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ నాయకులు సహకరించాలని అన్నారు. రెబల్ గా పోటీ చేసే అభ్యర్థులు ఇతర పార్టీల నుండి పోటీ చే సే అభ్యర్థులకు తలొగ్గకుండా కార్యకర్తలు సైనికుల్లా పని చేసి పార్టీ నిర్ణయించిన వ్యక్తికి పూర్తి మద్దతు తెలిపి గెలి పించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రామక ష్ణాపురం నడి కూడ, కంట ఆత్మకూరు, లక్ష్మీపురం, చౌటుపర్తి, ముత్యాలపల్లి, వెంకటాపురం అభ్యర్థులతోపాటు టిఆర్ఎస్ పార్టీ నాయకులు జెడ్పిటిసి పాడి కల్పన దేవి, ప్రతాపరెడ్డి, బండి సారంగపాణి, దగ్గు విజేందర్ రావు, ప్రకాష్ రావు, బొచ్చు వినరు, కోరే రమేష్, గాండ్ల కుమార్, జిల్లా రైతు కోఆర్డినేటర్ బొల్లె బిక్షపతి పరకాల వార్డు వార్డు కౌన్సిలర్ లు టీఆర్ఎస్వి నాయకులు పోచంపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు.