Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావ రణంలో జరుపుకోవాలని పరకాల ఏసీపీ వై.వి.ఎస్ సుధీంద్ర అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో రాజకీయ నాయకులకు ఎన్నికల పై అవ గాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏసీపీ సుధీంద్ర పాల్గొని మాట్లాడారు. ప్రజా స్వామ్యంలో పోటీ ఉండాలని, ప్రజలు ఇచ్చిన తీర్పు కు క ట్టుబడి ఉండాలని సూచించారు. ఎన్నికలలో గెలుపు ఓట ములు సహజమని, ఓడిపోయినంత మాత్రాన మనో వేదనకు గురి కావద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావ రణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయ్యాకనే ఎన్నికల ప్ర క్రియ ముగుస్తుందని తెలిపారు. ఉప సర్పంచి ఎన్నికలకు వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు సహకరించాలని అన్నారు. ఓటమిని ప్రతి ఒక్కరు స్వీకరించాలని, ప్రజల మధ్యన ఉంటూ రాబోయే రోజుల్లో విజయం కోసం క షి చేయాలన్నారు. కౌంటింగ్ సమయాల్లో ఎన్నికల నియ మావళి ప్రకారమే నడుచుకోవాలని సూచించారు. పంచా యతీ ఎన్నికల తుది తీర్పు రిటర్నింగ్ అధికారి పైనే ఆధా రపడి ఉంటుందన్నారు. అభ్యర్థులు వాదానికి ఎలాంటి గొడవలకు వద్దని సూచించారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో సెల్ ఫోన్ లో అనుమతి ఉండదన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో అనురాధ, ఈవోపీఆర్డీ సరస్వతి ,సీఐ షాదుల్లా బాబా, ఎస్సై జక్కుల రాజబాబు, సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు పాల్గొన్నారు.